Breaking News: తిరుమల వైకుంఠ ఏకాదశి పై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

Breaking News: తిరుమల వైకుంఠ ఏకాదశి పై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత

మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం

దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు

మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు

జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయింపు

మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపు

నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం

డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు

టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం

జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయింపు

ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు

పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *